దేవతల కాలం నుంచి నేటి ఆధునికయుగం వరకు విశిష్ట చరిత్ర గల వంశం పద్మశాలీయులది. ఇతిహాసాల ఆధారంగా సృష్టికర్త బ్రహ్మ మానసపుత్రులైన నవబ్రహ్మలలో ఒకరైన భృగు మహర్షి కుమారుని కుమారుడగు మార్కండేయుని వంశపరంపరగా కలియుగంలో వర్ధిల్లుతున్న పద్మశాలీయుల చరిత్ర ఎంతో ఘనమైనది. మాన రక్షకులుగా ఆనాడు దేవతలకు ఈనాటి మానవజాతికి యుగయుగాలుగా వస్త్ర నిర్మాణం చేస్తున్న ఘనకీర్తి ఉన్నది. చరిత్ర సాక్ష్యాలుగా ఎన్నో ఆధారాలతో వ్యవహరింపబడుతున్న పద్మశాలి వంశం భారతదేశంలో హిందూ సాంప్రదాయబద్ధంగా ఆచార వ్యవహారాలు పాటిస్తూ, […]
నల్లగొండ జిల్లా, వెల్వర్తి కి చెందిన ఒక సామాన్య చేనేత కుటుంబం నుంచి వచ్చినవాడు ఆచార్య రవ్వా శ్రీహరి. నల్లగొండలో 1943, సెప్టెంబరు 12 న జన్మించిన ఇతడు చిన్నతనంలోనే తల్లిని కోల్పోయాడు. ఒక చిన్న చెల్లెలు, ఒక చిన్న తమ్ముడు గల ఇతడే ఆ ఇంటికి పెద్ద. యాదగిరి లక్ష్మీనృసింహ సంస్కృత విద్యాపీఠంలో సురవరం ప్రతాపరెడ్డి, ఎం.నరసింగరావుల సహాయంతో చేరాడు. కప్పగంతుల లక్ష్మణశాస్త్రి ఇతనికి గురువు. తరువాత హైదరాబాద్ లోని సీతారాంబాగ్లో కల సంస్కృత కళాశాలలో […]



